విద్యుత్ షాక్ తో కేరళావాసి కువైట్లో మృతి
- July 11, 2017
కువైట్ : తన కార్యాలయంలో డ్రిల్లింగ్ మెషిన్ తో పనిచేసుకొంటున్న ఓ ప్రవాసీయ భారతీయునికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కొట్టడంతో గుండె ఆగి మరణించాడు. దక్షణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ మలయాళీ వ్యక్తి పేరు బిజూజార్జి (38) గా గుర్తించారు. కేరళ లోని పతనందిట్ట జిల్లా లోని జార్జ్ , చిన్నమ్మ దంపతుల కుమారుడైన బిజూజార్జి కువైట్ లోని ప్రిస్మా అల్యూమినియం ఫాబ్రికేషన్ కంపెనీలో ఒక ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక డ్రిల్లింగ్ మెషిన్ నుండి విద్యుత్ బిజూ జార్జి శరీరంలోనికి ఒక్కసారిగా ప్రవహించడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే బిజును ముబారకియా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, కాని విద్యుత్ షాక్ సోకడంతో గుండె అకస్మాత్తుగా ఆగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బిజూ జార్జి భార్య టెస్సిమోల్ హవాలీలోని ఒక ప్రైవేటు క్లినిక్ లో ఒక నర్సుగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు మూడేళ్ళ అల్బిన్ మరియు ఇటీవల జన్మించిన నెలల వయస్సు గల ఇమిలిన్ ఉన్నారు.బిజూజార్జి కుటుంబం సెలవులు గడిపేందుకు ఇటీవల కేరళ వెళ్ళింది.జరిగిన ఈ విషాదంతో వారు కువైట్ తిరిగి రావాల్సి ఉంది. బిజూజార్జి భౌతికకాయంను డాజీజ్ మార్చురీ లో భద్రపరిచారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







