విద్యుత్ షాక్ తో కేరళావాసి కువైట్లో మృతి
- July 11, 2017
కువైట్ : తన కార్యాలయంలో డ్రిల్లింగ్ మెషిన్ తో పనిచేసుకొంటున్న ఓ ప్రవాసీయ భారతీయునికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కొట్టడంతో గుండె ఆగి మరణించాడు. దక్షణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ మలయాళీ వ్యక్తి పేరు బిజూజార్జి (38) గా గుర్తించారు. కేరళ లోని పతనందిట్ట జిల్లా లోని జార్జ్ , చిన్నమ్మ దంపతుల కుమారుడైన బిజూజార్జి కువైట్ లోని ప్రిస్మా అల్యూమినియం ఫాబ్రికేషన్ కంపెనీలో ఒక ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక డ్రిల్లింగ్ మెషిన్ నుండి విద్యుత్ బిజూ జార్జి శరీరంలోనికి ఒక్కసారిగా ప్రవహించడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే బిజును ముబారకియా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, కాని విద్యుత్ షాక్ సోకడంతో గుండె అకస్మాత్తుగా ఆగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బిజూ జార్జి భార్య టెస్సిమోల్ హవాలీలోని ఒక ప్రైవేటు క్లినిక్ లో ఒక నర్సుగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు మూడేళ్ళ అల్బిన్ మరియు ఇటీవల జన్మించిన నెలల వయస్సు గల ఇమిలిన్ ఉన్నారు.బిజూజార్జి కుటుంబం సెలవులు గడిపేందుకు ఇటీవల కేరళ వెళ్ళింది.జరిగిన ఈ విషాదంతో వారు కువైట్ తిరిగి రావాల్సి ఉంది. బిజూజార్జి భౌతికకాయంను డాజీజ్ మార్చురీ లో భద్రపరిచారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









