విద్యుత్ షాక్ తో కేరళావాసి కువైట్లో మృతి
- July 11, 2017
కువైట్ : తన కార్యాలయంలో డ్రిల్లింగ్ మెషిన్ తో పనిచేసుకొంటున్న ఓ ప్రవాసీయ భారతీయునికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కొట్టడంతో గుండె ఆగి మరణించాడు. దక్షణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ మలయాళీ వ్యక్తి పేరు బిజూజార్జి (38) గా గుర్తించారు. కేరళ లోని పతనందిట్ట జిల్లా లోని జార్జ్ , చిన్నమ్మ దంపతుల కుమారుడైన బిజూజార్జి కువైట్ లోని ప్రిస్మా అల్యూమినియం ఫాబ్రికేషన్ కంపెనీలో ఒక ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక డ్రిల్లింగ్ మెషిన్ నుండి విద్యుత్ బిజూ జార్జి శరీరంలోనికి ఒక్కసారిగా ప్రవహించడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే బిజును ముబారకియా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, కాని విద్యుత్ షాక్ సోకడంతో గుండె అకస్మాత్తుగా ఆగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బిజూ జార్జి భార్య టెస్సిమోల్ హవాలీలోని ఒక ప్రైవేటు క్లినిక్ లో ఒక నర్సుగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు మూడేళ్ళ అల్బిన్ మరియు ఇటీవల జన్మించిన నెలల వయస్సు గల ఇమిలిన్ ఉన్నారు.బిజూజార్జి కుటుంబం సెలవులు గడిపేందుకు ఇటీవల కేరళ వెళ్ళింది.జరిగిన ఈ విషాదంతో వారు కువైట్ తిరిగి రావాల్సి ఉంది. బిజూజార్జి భౌతికకాయంను డాజీజ్ మార్చురీ లో భద్రపరిచారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









