విద్యుత్ షాక్ తో కేరళావాసి కువైట్లో మృతి
- July 11, 2017
కువైట్ : తన కార్యాలయంలో డ్రిల్లింగ్ మెషిన్ తో పనిచేసుకొంటున్న ఓ ప్రవాసీయ భారతీయునికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కొట్టడంతో గుండె ఆగి మరణించాడు. దక్షణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ మలయాళీ వ్యక్తి పేరు బిజూజార్జి (38) గా గుర్తించారు. కేరళ లోని పతనందిట్ట జిల్లా లోని జార్జ్ , చిన్నమ్మ దంపతుల కుమారుడైన బిజూజార్జి కువైట్ లోని ప్రిస్మా అల్యూమినియం ఫాబ్రికేషన్ కంపెనీలో ఒక ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక డ్రిల్లింగ్ మెషిన్ నుండి విద్యుత్ బిజూ జార్జి శరీరంలోనికి ఒక్కసారిగా ప్రవహించడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే బిజును ముబారకియా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, కాని విద్యుత్ షాక్ సోకడంతో గుండె అకస్మాత్తుగా ఆగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బిజూ జార్జి భార్య టెస్సిమోల్ హవాలీలోని ఒక ప్రైవేటు క్లినిక్ లో ఒక నర్సుగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు మూడేళ్ళ అల్బిన్ మరియు ఇటీవల జన్మించిన నెలల వయస్సు గల ఇమిలిన్ ఉన్నారు.బిజూజార్జి కుటుంబం సెలవులు గడిపేందుకు ఇటీవల కేరళ వెళ్ళింది.జరిగిన ఈ విషాదంతో వారు కువైట్ తిరిగి రావాల్సి ఉంది. బిజూజార్జి భౌతికకాయంను డాజీజ్ మార్చురీ లో భద్రపరిచారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







