దాదాసాహేబ్ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ను ఘనంగా సత్కరించిన ఏపీ ప్రభుత్వం
- July 12, 2017
ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ను ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి విశ్వనాథ్ అని, ఆయన్ను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశ్వనాథ్ జాతి సంపద అన్నారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీదా ఉందన్నారు. ప్రపంచమంతా కూచిపూడికి పేరుందని, దాన్ని మర్చిపోకుండా ఈ ఏడాది 60 వేల మందికి నేర్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని కె.విశ్వనాథ్ నిరూపించారని కొనియాడారు. ఇది అసామాన్యమైన అవార్డు అని దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు. ఈ అవార్డు వచ్చినా కళ్లు నెత్తిన ఎక్కకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. అవార్డులు శాశ్వతం కాదని చెప్పారు. కష్టపడి పని చేస్తే దేవుడు ఆలస్యం చేస్తాడేమో గానీ, అన్యాయం చేయడన్న నమ్మకం ఉందన్నారు. సినిమా అనే ఆయుధంతోనే ఇక్కడి వరకు రాగలిగానని విశ్వనాథ్ చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







