దాదాసాహేబ్ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించిన ఏపీ ప్రభుత్వం

- July 12, 2017 , by Maagulf
దాదాసాహేబ్ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించిన ఏపీ ప్రభుత్వం

ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌ను ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి విశ్వనాథ్ అని, ఆయన్ను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశ్వనాథ్ జాతి సంపద అన్నారు. భాషను కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీదా ఉందన్నారు. ప్రపంచమంతా కూచిపూడికి పేరుందని, దాన్ని మర్చిపోకుండా ఈ ఏడాది 60 వేల మందికి నేర్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని కె.విశ్వనాథ్ నిరూపించారని కొనియాడారు. ఇది అసామాన్యమైన అవార్డు అని దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు. ఈ అవార్డు వచ్చినా కళ్లు నెత్తిన ఎక్కకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. అవార్డులు శాశ్వతం కాదని చెప్పారు. కష్టపడి పని చేస్తే దేవుడు ఆలస్యం చేస్తాడేమో గానీ, అన్యాయం చేయడన్న నమ్మకం ఉందన్నారు. సినిమా అనే ఆయుధంతోనే ఇక్కడి వరకు రాగలిగానని విశ్వనాథ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com