తమిళ స్టార్ హీరో సూర్య తో పాటు ఇతరుల కేసు కొట్టేసిన మద్రాస్ కోర్టు
- July 13, 2017
తమిళ చిత్ర పరిశ్రమ హీరో హీరోయిన్ లు సూర్య, శరత్ కుమార్, సత్యరాజ్, అరు్ విజయ్, చేరన్, శ్రీప్రియ, వివేక్ లకి కోర్టు లో ఊరట లభించింది. ఊటీ కోర్టు లో నమోదు అయిన కేసు నుంచి మద్రాస్ హై కోర్టు విముక్తిని ఇచ్చింది. 2009 లో ఒక సంతాప కార్యక్రమం లో పాల్గొన్న వీరు అందరూ విలేకారులని దూషించారు అనే కేసు ఇప్పటికీ నడుస్తోంది.
ఊటీకి చెందిన మరియకు అనే రిపోర్టర్ వేసిన ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా నడుస్తూ ఉండగా సూర్య నుంచి ఇతరులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. అదే కేసు ని ఇప్పుడు హై కోర్టు కొట్టేసింది. గతంలో ఊటీ కోర్టుకు విచారణకు రావాలని వీరందరికీ తాఖీదులు పంపినా, వీరు రాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.
ఆపై వీరంతా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత వారెంట్లను నిలుపుదల చేసిన న్యాయస్థానం, ఆపై కేసును విచారించి, దాన్ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







