తమిళ స్టార్ హీరో సూర్య తో పాటు ఇతరుల కేసు కొట్టేసిన మద్రాస్ కోర్టు

- July 13, 2017 , by Maagulf
తమిళ స్టార్ హీరో సూర్య తో పాటు ఇతరుల కేసు కొట్టేసిన మద్రాస్ కోర్టు

తమిళ చిత్ర పరిశ్రమ హీరో హీరోయిన్ లు సూర్య, శరత్ కుమార్, సత్యరాజ్, అరు్ విజయ్, చేరన్, శ్రీప్రియ, వివేక్ లకి కోర్టు లో ఊరట లభించింది. ఊటీ కోర్టు లో నమోదు అయిన కేసు నుంచి మద్రాస్ హై కోర్టు విముక్తిని ఇచ్చింది. 2009 లో ఒక సంతాప కార్యక్రమం లో పాల్గొన్న వీరు అందరూ విలేకారులని దూషించారు అనే కేసు ఇప్పటికీ నడుస్తోంది.
ఊటీకి చెందిన మరియకు అనే రిపోర్టర్ వేసిన ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా నడుస్తూ ఉండగా సూర్య నుంచి ఇతరులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. అదే కేసు ని ఇప్పుడు హై కోర్టు కొట్టేసింది. గతంలో ఊటీ కోర్టుకు విచారణకు రావాలని వీరందరికీ తాఖీదులు పంపినా, వీరు రాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.
ఆపై వీరంతా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత వారెంట్లను నిలుపుదల చేసిన న్యాయస్థానం, ఆపై కేసును విచారించి, దాన్ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com