తమిళ స్టార్ హీరో సూర్య తో పాటు ఇతరుల కేసు కొట్టేసిన మద్రాస్ కోర్టు
- July 13, 2017
తమిళ చిత్ర పరిశ్రమ హీరో హీరోయిన్ లు సూర్య, శరత్ కుమార్, సత్యరాజ్, అరు్ విజయ్, చేరన్, శ్రీప్రియ, వివేక్ లకి కోర్టు లో ఊరట లభించింది. ఊటీ కోర్టు లో నమోదు అయిన కేసు నుంచి మద్రాస్ హై కోర్టు విముక్తిని ఇచ్చింది. 2009 లో ఒక సంతాప కార్యక్రమం లో పాల్గొన్న వీరు అందరూ విలేకారులని దూషించారు అనే కేసు ఇప్పటికీ నడుస్తోంది.
ఊటీకి చెందిన మరియకు అనే రిపోర్టర్ వేసిన ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా నడుస్తూ ఉండగా సూర్య నుంచి ఇతరులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. అదే కేసు ని ఇప్పుడు హై కోర్టు కొట్టేసింది. గతంలో ఊటీ కోర్టుకు విచారణకు రావాలని వీరందరికీ తాఖీదులు పంపినా, వీరు రాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.
ఆపై వీరంతా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత వారెంట్లను నిలుపుదల చేసిన న్యాయస్థానం, ఆపై కేసును విచారించి, దాన్ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









