కోటి రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన సెల్ఫీ
- July 16, 2017
యువతకు సెల్ఫీ ఓ క్రేజ్. ఎక్కడంటే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కొన్నిసార్లు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కానీ ఈ సెల్ఫీ మాత్రం దాదాపు 2లక్షల డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కొక్కటి 20వేల డాలర్ల ఖరీదు చేసే వస్తువులు ఆమె సెల్ఫీ కారణంగా ముక్కలు ముక్కలై పోయాయి.
అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ది 14 ఫ్యాక్టర్టీ ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనలో హాంకాంగ్కు చెందిన కళాకారుడు సిమన్ బిర్చ్ వినూత్నమైన డిజైన్లలతో తయారుచేసిన కిరీటాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శన వీక్షించేందుకు వచ్చిన ఓ యువతి వాటి ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవాలని సంబరపడింది. సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె జారి కిరీటాలు నిలబెడ్డిన స్టాండ్స్కు తగిలింది. ఇంకేముంది అవన్నీ ఒకదాని వెంట మరొకటి పడిపోయి పగిలిపోయాయి. వాటి ఖరీదు దాదాపు 2లక్షల డాలర్లు ఉంటుందట. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.28కోట్లు. ఆ కిరీటం ఒక్కోదాని తయారీకి 20 నుంచి 30 గంటలు పట్టిందట.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అంత ఖరీదైన వస్తువులు పగిలిపోయినా కూడా వాటిని తయారుచేసిన కళాకారుడు ఆమెను ఏమీ అనలేదు. ఇది కావాలని చేసిన పని కాదు.. ఆ యువతి పట్టుతప్పిపోయి పడటం వల్ల అవి పగిలిపోయాయి అని అన్నారు. ఆమె దగ్గర నుంచి ఎటువంటి నష్టపరిహారం కూడా తీసుకోలేదని తెలిపాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







