కామెరూన్లో 30 మంది సైనికుల గల్లంతు
- July 17, 2017
యవోండే: ఆఫ్రికా దేశం కామెరూన్లో జరిగిన ఓడ ప్రమాదంలో 34 మంది జాడ తెలియకుండా పోయారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ బ్రిగేడ్కు చెందిన సైనికులు తమ ఓడలో ఇంధనం నింపుకునేందుకు బకాస్సీ నగరం వైపు వస్తుండగా సముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా పడవ మునిగిపోవటంతో అందులోని 37 మంది నీట మునిగారని, తక్షణం స్పందించిన సైన్యం ముగ్గురిని రక్షించగలిగిందని రక్షణశాఖ మంత్రి జోసెఫ్ బెటి అస్సోమో తెలిపారు.
ఇంకా 30 మంది జాడ కోసం గాలింపు చేపట్టామని వివరించారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన బోకో హరామ్ ముస్లిం తీవ్రవాదులను ఏరివేసేందుకు కామెరూన్ ప్రభుత్వం ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









