కామెరూన్‌లో 30 మంది సైనికుల గల్లంతు

- July 17, 2017 , by Maagulf
కామెరూన్‌లో 30 మంది సైనికుల గల్లంతు

యవోండే: ఆఫ్రికా దేశం కామెరూన్‌లో జరిగిన ఓడ ప్రమాదంలో 34 మంది జాడ తెలియకుండా పోయారు. ర్యాపిడ్‌ ఇంటర్వెన్షన్‌ బ్రిగేడ్‌కు చెందిన సైనికులు తమ ఓడలో ఇంధనం నింపుకునేందుకు బకాస్సీ నగరం వైపు వస్తుండగా సముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా పడవ మునిగిపోవటంతో అందులోని 37 మంది నీట మునిగారని, తక్షణం స్పందించిన సైన్యం ముగ్గురిని రక్షించగలిగిందని రక్షణశాఖ మంత్రి జోసెఫ్‌ బెటి అస్సోమో తెలిపారు.
 
ఇంకా 30 మంది జాడ కోసం గాలింపు చేపట్టామని వివరించారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన బోకో హరామ్‌ ముస్లిం తీవ్రవాదులను ఏరివేసేందుకు కామెరూన్‌ ప్రభుత్వం ర్యాపిడ్‌ ఇంటర్వెన్షన్‌ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com