ముగ్గురికి నచ్చని కథ హీరోవరుణ్ కు నచ్చింది

- July 18, 2017 , by Maagulf
ముగ్గురికి నచ్చని కథ హీరోవరుణ్ కు నచ్చింది

వరుస ప్లాప్స్ తో ఇబ్బందులో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్.ప్రస్తుతం ఫిదా మూవీ ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తోనే తన జాతకం నిలిబడి ఉందని ఫిలిం సర్కిల్లో అంత మాట్లడుకుంటున్నారు. ఈ నెల 21 ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కథ కు సంబదించిన ఓ న్యూస్ బయటకు వచ్చి మెగా అభిమానులను ఖంగారు పెడుతుంది. ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల మొదట ఈ కథ ను ముగ్గురు హీరోలకు వినిపించాడట.
అయితే ఏ ఒక్కరు కూడా ఈ కథ ఫై ఇంట్రస్ట్ చూపించలేదట. ఈ విషయాన్ని దిల్ రాజే పరోక్షంగా చెప్పాడు. ఈ సినిమా కథ చాన్నాళ్ల కిందటే తనకు శేఖర్ చెప్పాడని, స్టార్ హీరోతో రూపొందించాలని అనుకున్నామని అందుకే ముగ్గురు హీరోలకు ఈ సినిమా కథను వివరించామని రాజు చెప్పాడు. అయితే వారెవరితోనూ ఈ సినిమా పట్టాలెక్కలేదని.. వరుణ్ తేజ్ అయితే కరెక్ట్ అనిపించి ఈ హీరోతో ఈ కథను తెరకెక్కించామని రాజు చెప్పుకొచ్చాడు.
మరి వారికీ నచ్చని కథ మెగా హీరోకు నచ్చడం అనేది ఇప్పుడు మెగా అభిమానులను భయపెడుతుంది. మరి వరుణ్ కు అంతగా నచ్చిన ఈ కథ ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది అనేది చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com