పూర్తయిన జాయెద్ టౌన్ ఎగ్జిట్ పనులు
- July 20, 2017
మనామా: మినిస్టర్ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ మాట్లాడుతూ, షేక్ సల్మాన్ హైవే నుంచి డ్రైవింగ్ స్కూల్ నార్త్ వైపుకు జాయెద్ టౌన్ ఎగ్జిట్ కన్స్ట్రక్షన్ పూర్తయినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ని స్మూత్గా సాగేందుకు చేపట్టిన ఈ నిర్మాణంతో వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారాయన. ఇసా టౌన్ గేట్ ట్రాఫిక్ సిగ్నల్ వైపు వెళ్ళే అవకాశం లేకుండా రిఫ్ఫా మీదుగా జాయెద్ టౌన్ నుంచి వెళ్ళడానికి వీలుంటుంది. 2017 జూన్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. జాయెద్ టౌన్ ఎంట్రన్స్ మొత్తం 500 మీటర్లు. ఎక్స్కవేషన్స్ కోసం 261,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేశారు. అస్ఫాల్ట్ పేవింగ్ వర్క్స్ కోసం 106,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేయడం జరిగింది. లెవలింగ్, ప్రొటెక్టింగ్ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్, వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్, పేవింగ్ వర్క్స్, సిగ్నేజ్, లైటింగ్ తదితర పనులు ఈ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









