కార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఖరీఫ్ ఊతం
- July 20, 2017
మస్కట్: ఖరీఫ్ సీజన్ ఫుల్ స్వింగ్లో ఉండటంతో మస్కట్ మరియు సలాలా మధ్య ఆటో క్యారియర్స్కి డిమాండ్ పెరిగింది. ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎక్కువమంది ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలు చాలావరకు తగ్గాయని అల్ అవ్వాన్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఒకరు చెప్పారు. ఫ్యూయల్ ధరల పెరుగుదల కూడా వాహనదారులు, సొంత వాహనాల్ని పక్కన పెట్టి ట్రాన్స్పోర్ట్ వాహనాలపై దృష్టిపెట్డడానికి కారణమని ఆయన వివరించారు. ఇక్కడ రిస్క్ అనేది ముఖ్యమైన అంశమనీ, ఆ రిస్క్ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని చెబుతూ, సేఫ్టీకి ప్రాధాన్యమిచ్చేవారు ఎక్కువవుతున్నట్లు తెలియజేశారు. మస్కట్ నుంచి సలాలా వచ్చి వెళ్ళేందుకు సెలూన్ కార్లో 85 ఒమన్ రియాల్స్ ఖర్చవుతుండగా, ఎస్యూవీకి 100 ఒమన్ రియాల్స్ ఖర్చవుతోంది. సలాలా నుంచి మస్కట్ కంటే మస్కట్ నుంచి సలాలాకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. హాలీడే మేకర్స్తోపాటు కంపెనీల నుంచి కూడా తమకు బిజినెస్ ఎక్కువగా ఉంటోందని ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









