కార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఖరీఫ్ ఊతం
- July 20, 2017
మస్కట్: ఖరీఫ్ సీజన్ ఫుల్ స్వింగ్లో ఉండటంతో మస్కట్ మరియు సలాలా మధ్య ఆటో క్యారియర్స్కి డిమాండ్ పెరిగింది. ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎక్కువమంది ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలు చాలావరకు తగ్గాయని అల్ అవ్వాన్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఒకరు చెప్పారు. ఫ్యూయల్ ధరల పెరుగుదల కూడా వాహనదారులు, సొంత వాహనాల్ని పక్కన పెట్టి ట్రాన్స్పోర్ట్ వాహనాలపై దృష్టిపెట్డడానికి కారణమని ఆయన వివరించారు. ఇక్కడ రిస్క్ అనేది ముఖ్యమైన అంశమనీ, ఆ రిస్క్ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని చెబుతూ, సేఫ్టీకి ప్రాధాన్యమిచ్చేవారు ఎక్కువవుతున్నట్లు తెలియజేశారు. మస్కట్ నుంచి సలాలా వచ్చి వెళ్ళేందుకు సెలూన్ కార్లో 85 ఒమన్ రియాల్స్ ఖర్చవుతుండగా, ఎస్యూవీకి 100 ఒమన్ రియాల్స్ ఖర్చవుతోంది. సలాలా నుంచి మస్కట్ కంటే మస్కట్ నుంచి సలాలాకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. హాలీడే మేకర్స్తోపాటు కంపెనీల నుంచి కూడా తమకు బిజినెస్ ఎక్కువగా ఉంటోందని ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







