మరోసారి జనం మధ్యలోకి జనసేన అధినేత
- July 26, 2017
జనసేన నేత పవన్ కళ్యాణ్ మరోసారి జనాల మధ్యలోకి రాబోతున్నాడు. జులై 29 న ఉద్దానంలోని కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడి , అక్కడ పర్యటించబోతున్నట్లు సమాచారం. మరుసటి రోజు జులై 30న వైజాగ్ హార్వర్డ్ వైద్యులతో పవన్ సమావేశమై చర్చిస్తారు. అనంతరం పవన్, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడబోతున్నారని సమాచారం.
పవన్ కల్యాణ్ ఇప్పటికే హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు. ఆయన కొద్ది నెలల కిందట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించేందుకు వెళ్లారు. ఆ సందర్బంగా అక్కడి మెడికల్ స్కూల్ వైద్యులతో మాట్లాడుతూ.. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









