మరోసారి జనం మధ్యలోకి జనసేన అధినేత
- July 26, 2017
జనసేన నేత పవన్ కళ్యాణ్ మరోసారి జనాల మధ్యలోకి రాబోతున్నాడు. జులై 29 న ఉద్దానంలోని కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడి , అక్కడ పర్యటించబోతున్నట్లు సమాచారం. మరుసటి రోజు జులై 30న వైజాగ్ హార్వర్డ్ వైద్యులతో పవన్ సమావేశమై చర్చిస్తారు. అనంతరం పవన్, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడబోతున్నారని సమాచారం.
పవన్ కల్యాణ్ ఇప్పటికే హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు. ఆయన కొద్ది నెలల కిందట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించేందుకు వెళ్లారు. ఆ సందర్బంగా అక్కడి మెడికల్ స్కూల్ వైద్యులతో మాట్లాడుతూ.. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







