జేమ్స్ కెమరూన్ 'టైటానిక్' మరోసారి వస్తోంది
- July 28, 2017
టైటానిక్ ఓడ సముద్రంలో మునిగి 105ఏళ్లు దాటినా ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామంటే హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ చిత్రమే కారణం. అసలైన టైటానిక్ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏ సమయానికి ఓడ మంచు కొండను ఢీకొన్నది.. ఎలా మునిగిపోయింది.. ఎంత సమయం పట్టింది లాంటి అంశాలను చూపిస్తూ అందులో ఓ ప్రేమకథను నడిపించారయన. అయితే ఇప్పుడు మరోసారి ఆ టైటానిక్ తెరపైకి తెస్తూ.. తను తీసిన చిత్రంలోని లోటుపాట్లపై వివరణ ఇస్తూ టైటానిక్పై ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నారట.
టైటానిక్ చిత్రం విడుదలై గత ఏప్రిల్ నెలకు 20ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఆ చిత్రంలోని పలు సన్నివేశాల్లో జరిగిన ఘటనలు స ందేహాలుగానే మిగిలిపోయాయి. వాటికి వివరణ ఇస్తూ.. టైటానిక్ చిత్ర విశేషాలు.. చరిత్ర సవివరంగా తెలిపేలా టైటానిక్పై గంట నిడివి గల ఒక డాక్యుమెంటరీని రూపొందించనున్నారు. దీని గురించి జేమ్స్ మాట్లాడుతూ ‘నేను ‘టైటానిక్’ కథ రాసుకున్నప్పుడు.. తెరకెక్కించే సమయంలో నిజమైన టైటానిక్లాగే ప్రతీది యథాతథంగా.. సవివరంగా చూపించాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక చరిత్రను మరోసారి రూపొందించా. దీన్ని టైటానిక్ ప్రమాదలో మరణించిన వారి గౌరవార్థం చిత్రీకరించా. కానీ నేను అనుకున్నట్టుగానే సినిమాను తీయగలిగానా అని నాకే సందేహం. అందుకే ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ వారితో కలిసి తాజా పరిశోధనలు.. సాంకేతిక సహాయంతో మరోసారి టైటానిక్ను కళ్లముందు ఆవిష్కరించబోతున్నా’ని చెప్పుకొచ్చారు.
ఈ డాక్యుమెంటరీ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









