కతర్ పై చర్చించేందుకు అరబ్ దేశాలు బహ్రెయిన్ లో సమావేశం కానున్నాయి
- July 30, 2017
కతర్ పై నిషేధంపై తాజా పరిణామాలను చర్చించేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మనామలో సమావేశం కానున్నాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రి శనివారం మాట్లాడుతూ ఈ రెండు రోజుల సమావేశంలో నాలుగు అరబ్ దేశాలు కతర్ డిమాండ్లు తెల్సుకోవడం, తమ తమ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం నిలువరించే యత్నం చేయనున్నాయి. ఈజిప్టు చేసిన ప్రకటన ప్రకారం కతర్ 18 గ్రూపులు మరియు వారి తీవ్రవాద జాబితాలతో కతర్ అనుసంధానించబడిన వ్యక్తులతో జోడించబడి ఉన్నట్లు గతవారం పేర్కొంది. కతర్ తో తమకు ఉన్న దీర్ఘకాలం ముస్లిం సోదర సంబంధాలు ఆయా కారణాలచే విచ్ఛిన్నం కాబడిందని తెలిపారు. నాలుగు ప్రభుత్వాలచే ఆయా తీవ్రవాద గ్రూపుగా నిషేధించబడింది. వారు అల్ -జజీర టీవీ ప్రసారాలను మరియు టర్కిష్ సైనిక స్థావరాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు మరియు ఈ ప్రాంతంలో సౌదీ నేతృత్వంలోని పాలసీ ప్రత్యేకంగా ఇరాన్ వైపుకు కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దౌత్య అధికారి ఫెడెరికే మోఘేరిని తో చర్చలు తరువాత మంత్రి సామెహ్ షౌకృ మాట్లాడుతూ నాలుగు ప్రభుత్వాలు కతర్ తో వివాదంపై రాజీకి అంగీకరించాలి అని హెచ్చరించారు. అయితే "మేము ఏ విధమైన తీవ్రవాద మద్దతుదారులతో రాజీపడలేము, లేదా అదేవిధంగా మేమంతా చర్చల రూపంలోకి రాలేమని శౌక్రీ విలేకరుల సమావేశంలో తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







