కతర్ పై చర్చించేందుకు అరబ్ దేశాలు బహ్రెయిన్ లో సమావేశం కానున్నాయి

- July 30, 2017 , by Maagulf
కతర్ పై చర్చించేందుకు అరబ్ దేశాలు బహ్రెయిన్ లో  సమావేశం కానున్నాయి

కతర్ పై  నిషేధంపై తాజా పరిణామాలను చర్చించేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మనామలో సమావేశం కానున్నాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రి శనివారం మాట్లాడుతూ    ఈ రెండు రోజుల సమావేశంలో నాలుగు అరబ్ దేశాలు  కతర్ డిమాండ్లు తెల్సుకోవడం, తమ తమ దేశాల  అంతర్గత వ్యవహారాలలో జోక్యం నిలువరించే యత్నం చేయనున్నాయి. ఈజిప్టు చేసిన ప్రకటన ప్రకారం కతర్  18 గ్రూపులు మరియు వారి తీవ్రవాద జాబితాలతో కతర్ అనుసంధానించబడిన వ్యక్తులతో  జోడించబడి ఉన్నట్లు గతవారం పేర్కొంది. కతర్ తో తమకు ఉన్న దీర్ఘకాలం ముస్లిం సోదర సంబంధాలు ఆయా కారణాలచే  విచ్ఛిన్నం కాబడిందని తెలిపారు. నాలుగు ప్రభుత్వాలచే ఆయా తీవ్రవాద గ్రూపుగా నిషేధించబడింది. వారు అల్ -జజీర టీవీ ప్రసారాలను మరియు టర్కిష్ సైనిక స్థావరాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు మరియు ఈ ప్రాంతంలో సౌదీ నేతృత్వంలోని పాలసీ ప్రత్యేకంగా ఇరాన్ వైపుకు కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా  యూరోపియన్ యూనియన్ దౌత్య అధికారి ఫెడెరికే  మోఘేరిని  తో చర్చలు తరువాత మంత్రి సామెహ్ షౌకృ మాట్లాడుతూ  నాలుగు ప్రభుత్వాలు కతర్ తో వివాదంపై రాజీకి  అంగీకరించాలి అని హెచ్చరించారు. అయితే  "మేము ఏ విధమైన తీవ్రవాద మద్దతుదారులతో రాజీపడలేము, లేదా అదేవిధంగా మేమంతా చర్చల రూపంలోకి రాలేమని శౌక్రీ విలేకరుల సమావేశంలో తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com