శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో దావూద్ సోదరి చిత్రం వాయిదా
- August 01, 2017
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’. అపూర్వ లఖియా దర్శకుడు. ముంబయి అండర్ వరల్డ్డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
ఇదే నెలలో షారుక్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, అక్షయ్ కుమార్ నటించిన ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకుడు అపూర్వ లఖియా నిర్ణయించారు.
ఈ విషయమై దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హసీనా’ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయాలనుకున్నాం. కానీ షారుక్, అక్షయ్ సినిమాలు కూడా అప్పుడే విడుదల అవుతున్నాయి. అందులోనూ అక్షయ్ చిత్రానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటప్పుడు మా సినిమాను విడుదల చేసి ప్రమాదం కొనితెచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







