శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో దావూద్‌ సోదరి చిత్రం వాయిదా

- August 01, 2017 , by Maagulf
శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో దావూద్‌ సోదరి చిత్రం వాయిదా

శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హసీనా: ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’. అపూర్వ లఖియా దర్శకుడు. ముంబయి అండర్‌ వరల్డ్‌డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్‌ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
ఇదే నెలలో షారుక్‌ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’, అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకుడు అపూర్వ లఖియా నిర్ణయించారు.
ఈ విషయమై దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హసీనా’ చిత్రాన్ని ఆగస్ట్‌ 18న విడుదల చేయాలనుకున్నాం. కానీ షారుక్‌, అక్షయ్‌ సినిమాలు కూడా అప్పుడే విడుదల అవుతున్నాయి. అందులోనూ అక్షయ్‌ చిత్రానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటప్పుడు మా సినిమాను విడుదల చేసి ప్రమాదం కొనితెచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com