హీరో బాలకృష్ణ 'జయసింహ' షూటింగ్ షురూ
- August 03, 2017
తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి ఊపుమీదున్ననందమూరి నటసింహ బాలకృష్ణతో కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ రూపొందించబోతోన్న సినిమా 'జయసింహ' షూటింగ్ రామోజీ ఫిల్మ్సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, కెఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించారు.ఆర్.ఎఫ్.సి.లో ఇప్పటికే ఈ చిత్రంకోసం ప్రత్యేకంగా ఓ సెట్ను నిర్మించారు.
ఆ సెట్లో 30 రోజుల పాటు బాలయ్య 102వ సినిమా లాంగ్ షెడ్యూల్ జరుపుకోబోతోంది. పైసావసూల్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 వ సినిమా నటించడం నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. గతంలో బాలకృష్ణ సరసన నయనతార చేసిన 'సింహా' .. 'శ్రీరామ రాజ్యం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
అందువలన ఈ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ వుంది. ఈ కారణంగానే నయనతారను తీసుకోవాలనే ఉద్దేశంతో తిసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ తన 101వ సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. 'పైసా వసూల్' పేరుతో .. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
'జయసింహ' చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. సికే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి కళ్యాణ్ నిర్మిస్తుంగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







