రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
- August 05, 2017
అల్ గర్హౌద్ బ్రిడ్జ్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని దుబాయ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు బ్రిడ్జిపైనున్న బ్యారియర్లను ఢీకొన్నాయి. మరో కారు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యింది. మధ్యాహ్నం 12.30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుర్ దుబాయ్ వైపుగా వెళుతుండగా వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదంలో ఓ కారు పూర్తిగా ధ్వంసమయ్యిందని దుబాయ్ పోలీస్ అధికార ప్రతినిథి తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని దుబాయ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించి మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









