తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్..!!

- October 21, 2015 , by Maagulf
తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్..!!

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతీ ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంవో ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కేసీఆర్ ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లనున్నారు. సూర్యాపేట నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళతారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com