హింసగా మారిన కెన్యా ఎన్నికల ప్రచారం
- August 06, 2017
మంగళవారం జరుగనున్న కెన్యా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరిదశలో హింసాకాండతో హోరెత్తింది. ప్రస్తుత అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా, ఆయన ప్రత్యర్థి రైలా ఒడింగాకు మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలో ఓట్ల రిగ్గింగ్, హింసాకాండ చోటు చేసుకుంటుందన్న భయాందోళనల మధ్య పోలింగ్కు రంగం సిద్ధమయింది. ప్రచారం చివరి దశలో ఎన్నికల అధికారి ఒకరు హత్యకు గురికావటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై పోలీసులు దాడి చేసి భయానక వాతా వరణం సృష్టించేందుకు కుట్ర పన్నారని ప్రతిపక్షం ప్రభు త్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. దాదాపు దశాబ్ద కాలం క్రితం జాతి విద్వేష దాడులతో హోరెత్తి వివాదాస్పదంగా మారిన ఎన్నికల అనంతరం మంగళవారం జరుగనున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. అప్పటి ఎన్నికల్లో చెలరేగిన హింసాకాండలో దాదాపు 1,100 మంది మరణిం చగా, ఆరులక్షల మంది నిర్వాసితులైన విషయం తెలిసిందే. కెన్యన్లు ఇప్పటి వరకూ ఆరు ఎన్నికలను చూసినప్పటికీ ప్రస్తుత ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై వుండటం విశేషం.
ముఖ్యంగా అధ్యక్షుడు కెన్యట్టా, ఆయన ప్రత్యర్థి ఒడింగా కుటుంబాల మధ్య దాదాపు అర్థశతాబ్దికి పైగా కొనసాగుతున్న రాజకీయ వైరానికి ఈ ఎన్నికలు చరమగీతం పాడనున్నాయన్న ప్రచారం విస్తృతంగా కొనసాగటమే ఇందుకు కారణం.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







