స్వైన్ ప్లూ బారిన పడిన బాలీవుడ్ హీరో ఆమీర్ దంపతులు

- August 06, 2017 , by Maagulf
స్వైన్ ప్లూ బారిన పడిన బాలీవుడ్ హీరో ఆమీర్ దంపతులు

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఇటీవల 'సత్యమేవ జయతే వాటర్ కప్ 2017' కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నది. కానీ తాను స్వైన్ ప్లూ బారిన పడడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నట్లు.. అందుకనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 
స్వచ్ఛంద సంస్థ పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూణే జరుగుతున్న 'సత్యమేవ జయతే వాటర్ కప్' కార్యక్రమంలో తాను అనారోగ్యం కారణంగా పాల్గొనలేక పోయినట్లు ఆమీర్ తెలిపారు.. అయితే ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. తనకు తన భార్య కిరణ్ రావు కు కూడా స్వైన్ ప్లూ అని అందుకని తమ స్వగృహం లో చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు.. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా తాను హెచ్1ఎన్1 స్వైన్ ప్లూ తో బాధపడుతున్నట్లు తెలిపింది.. అందుకనే బయటకు రావడం లేదని.. ఎవరిని కలవడం లేదని చెప్పారు.. అంతేకాదు తనతో పాటు తన భార్య కిరణ్ కు కూడా ఈ వ్యాధి సోకిందని వెల్లడించారు.. కాగా ఆమీర్ తో పాటు కిరణ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. పనీ ఫౌండేషన్ కు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్న సంగతి విధితమే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com