దుబాయ్లో ఇండియన్ కాన్సులేట్ యోగా ఈవెంట్
- August 08, 2017
దుబాయ్లోని ఇండియన్ కాన్సులూట్ జనరల్, యోదా ఈవెంట్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించనుంది. ఆధ్మాత్మిక, అలాగే భౌతిక ప్రయోజనాలకోసం సహజయోగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1970లో సహజ యోగాని శ్రీమతి మాతాజి నిర్మలా దేవి ఆవిష్కరించారు. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సహజయోగాని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈవెంట్ ఆర్గనైజర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావొచ్చు. అయితే, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం ఫాలో ఆన్ ఈవెంట్ జరుగుతుంది. దీనికోసం ఎలాంటి ప్రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బుర్ దుబాయ్లోని సింధి సెర్మోనియల్ హాల్లో శనివారం ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. సహజయోగాతో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటవుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









