కేరళీయుల కోసం 36 బడ్జెట్‌ విమాన సర్వీసులు

- August 09, 2017 , by Maagulf
కేరళీయుల కోసం 36 బడ్జెట్‌ విమాన సర్వీసులు

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ 40 అదనపు విమాన సర్వీసుల్ని షార్జా - ఇండియా మధ్య నడుపుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కేరళీకులయకు ఈద్‌, ఓనమ్‌ సందర్భంగా సెలవుల అనంతరం రిటర్న్‌ జర్నీ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానాల్లో ఒక్కోదాంట్లో 186 మంది ప్రయాణీకులుంటారు. ఆగస్ట్‌ 22 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ఈ తక్కువ ఛార్జీల విమానాలు సేవలందిస్తాయని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని తిరువనంతపురం, కోచి, కోజికోడ్‌తోపాటుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి సేవలందిస్తాయి. కేరళ నుంచి ఎక్కువగా యూఏఈకి వలస వెళ్ళినవారు ఉంటారనీ, ఈ కారణంగా ప్రత్యేక విమాన సర్వీసుల్ని కేరళకు నడుపుతామని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికార ప్రతినిథి వెల్లడించారు. యూఏఈలో మొత్తంగా 1 మిలియన్‌ కేరళీయులు ఉంటారనేది ఓ అంచనా. వారానికి 150 విమానాలు యూఏఈ నుంచి ఇండియాకి నడుపుతుంటారు. వీరిలో మెజార్టీ కేరళ సెక్టార్‌లోనే ప్రయాణిస్తుంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com