భారతీయులు ఖతార్ వెళ్లాలంటే వీసా అక్కర్లేదు
- August 10, 2017
ఇక నుంచి భారతీయులు ఖతార్ వెళ్లాలంటే వీసా వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు భారత్తో కలిపి 80 దేశాల ప్రజలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతి ఇస్తూ ఖతార్ నిర్ణయం తీసుకుంది. వాటిల్లో యూకే, యూఎస్, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు ఉన్నాయి. 'ఇక నుంచి ఖతార్ను సందర్శించేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు' అని ఖతార్ అధికారులు వెల్లడించారు. సందర్శనకు వచ్చేవారి కోసం ఎటువంటి రుసుం లేకుండా మల్టీ ఎంట్రీ మినహాయింపును జారీ చేస్తామని పేర్కొన్నారు. సందర్శకుడి జాతీ యతను బట్టి మినహాయింపు గడువు 180 రోజుల వరకు, 90 రోజులు ఖతార్లో గడిపేందుకు అనుమతి ఇస్తామని వివరించారు. ఖతార్ దేశ ఆతిథ్యం, చారిత్రక సాంస్కృతిని విస్తరించే కార్య క్రమంలో భాగంగా సందర్శకులను ఆహ్వానిస్తున్నామని, దానికోసమే 'ఫ్రీ వీసా' కల్పిస్తున్నట్టు పర్యాటక శాఖ చైైర్మెన్ హస్సన్ ఆల్ ఇబ్రహీం తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







