త్వరలో మామకు డైరెక్షన్ చెయ్యబోతున్న అల్లుడు
- August 11, 2017
ధనుష్ నటించిన 'వీఐపీ 2' శుక్రవారం తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన గౌతంమేనన్ దర్శకత్వంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై'లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఈ రెండూ పూర్తయిన తర్వాత 'మారి 2' చిత్రంలో నటించనున్నారు ధనుష్. అంతేకాకుండా ఓ హాలీవుడ్ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని చేజెక్కించుకున్నారు. ఇప్పటికే 'పవర్పాండి' సినిమాతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నారు ధనుష్. అదే అనుభవంతో త్వరలోనే తన మామ, సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెబుతున్నారు. దీనిపై ధనుష్ మాట్లాడుతూ 'రజనీకాంత్ నటించే ఓ సినిమాకు దర్శకత్వం వహించాలన్నదే నా కోరిక. అందుకోసం ఏకంగా 15 కథలు సిద్ధం చేసుకున్నా. వీటన్నింటి వన్లైన్ సిద్ధంగా ఉంది. అవకాశం రాగానే ఆయనకు వీటిని తప్పకుండా వినిపిస్తా.
నటిస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి ఆయన సినిమా నిర్మాతగా మారడమే పెద్ద అదృష్టం' అని ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









