త్వరలో మామకు డైరెక్షన్ చెయ్యబోతున్న అల్లుడు
- August 11, 2017
ధనుష్ నటించిన 'వీఐపీ 2' శుక్రవారం తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన గౌతంమేనన్ దర్శకత్వంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై'లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఈ రెండూ పూర్తయిన తర్వాత 'మారి 2' చిత్రంలో నటించనున్నారు ధనుష్. అంతేకాకుండా ఓ హాలీవుడ్ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని చేజెక్కించుకున్నారు. ఇప్పటికే 'పవర్పాండి' సినిమాతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నారు ధనుష్. అదే అనుభవంతో త్వరలోనే తన మామ, సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెబుతున్నారు. దీనిపై ధనుష్ మాట్లాడుతూ 'రజనీకాంత్ నటించే ఓ సినిమాకు దర్శకత్వం వహించాలన్నదే నా కోరిక. అందుకోసం ఏకంగా 15 కథలు సిద్ధం చేసుకున్నా. వీటన్నింటి వన్లైన్ సిద్ధంగా ఉంది. అవకాశం రాగానే ఆయనకు వీటిని తప్పకుండా వినిపిస్తా.
నటిస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి ఆయన సినిమా నిర్మాతగా మారడమే పెద్ద అదృష్టం' అని ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







