మాల్దీవుల్లో విద్యార్థులను మోసగించిన నారాయణరెడ్డి అరెస్ట్
- August 11, 2017
మాల్దీవుల్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను ఉద్యోగాల పేరుతో తీసుకువెళ్లి మోసగించిన బారెడ్డి వెంకట నారాయణరెడ్డి (42) అలియాస్ పెద్ద నారాయణరెడ్డిని మలక్పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు దిల్సుఖ్నగర్ గడ్డిఅన్నారం ప్రాంతంలో ఆర్యన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్కు అధ్యక్షుడు, ప్రిన్సిపల్గా వ్యవహరించారు. మరో భాగస్వామి పాశం నందు పరారీలో ఉన్నాడు. మరో భాగస్తుడైన మహీపతి కృష్ణచైతన్య (35)ను ఈనెల 6న అరెస్ట్ చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మలక్పేట పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా తొలుత నారాయణరెడ్డి భార్య అనితరెడ్డిని విచారించారు. తమను సింగపూర్కు పంపిస్తానని బ్యాంకాక్లో మోసగించాడని మరో నలుగురు విద్యార్థులు కూడా ప్రధాన నిందితుడిపై ఠాణాలో ఫిర్యాదు చేశారు.
భవిష్యత్తులో విద్యార్థులు మోసపోకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ విద్యార్థులు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







