మాల్దీవుల్లో విద్యార్థులను మోసగించిన నారాయణరెడ్డి అరెస్ట్
- August 11, 2017
మాల్దీవుల్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను ఉద్యోగాల పేరుతో తీసుకువెళ్లి మోసగించిన బారెడ్డి వెంకట నారాయణరెడ్డి (42) అలియాస్ పెద్ద నారాయణరెడ్డిని మలక్పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు దిల్సుఖ్నగర్ గడ్డిఅన్నారం ప్రాంతంలో ఆర్యన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్కు అధ్యక్షుడు, ప్రిన్సిపల్గా వ్యవహరించారు. మరో భాగస్వామి పాశం నందు పరారీలో ఉన్నాడు. మరో భాగస్తుడైన మహీపతి కృష్ణచైతన్య (35)ను ఈనెల 6న అరెస్ట్ చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మలక్పేట పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా తొలుత నారాయణరెడ్డి భార్య అనితరెడ్డిని విచారించారు. తమను సింగపూర్కు పంపిస్తానని బ్యాంకాక్లో మోసగించాడని మరో నలుగురు విద్యార్థులు కూడా ప్రధాన నిందితుడిపై ఠాణాలో ఫిర్యాదు చేశారు.
భవిష్యత్తులో విద్యార్థులు మోసపోకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ విద్యార్థులు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









