అమరావతి లోఈ నెల 16న లండన్ కింగ్స్ ఆస్పత్రికి శంకుస్థాపన
- August 14, 2017
అమరావతి మనందరికీ గర్వకారణం
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో సీఎం
ప్రపంచంలో మన కీర్తిపతాకను రెపరెపలాడించే అమరావతి మనందరికీ గర్వకారణం సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయనున్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. ఇప్పటికే విట్, ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలు రాజధానిలో తమ క్యాంప్సలను ప్రారంభించాయని, బీఆర్ శెట్టి వైద్యవిజ్ఞాన సంస్థ కొద్ది రోజుల క్రితమే ఇక్కడి తన ప్రాంగణానికి భూమిపూజ జరిపిందని పేర్కొన్నారు.
ఇదే బాటలో మరెన్నో విఖ్యాత విద్యాసంస్థలు అమరావతికి వస్తున్నాయన్న చంద్రబాబు... ప్రపంచంలో పేరొందిన లండన్ కింగ్స్ హాస్పిటల్ రూ.1000 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ నెల 16న శంకుస్థాపన జరుగుతుందన్నారు. రాజధానితోపాటు ప్రతి జిల్లాను ప్రగతికి చిహ్నంగా నిలిచేలా, వాటి భౌగోళిక స్థితిగతులు, లభ్యమయ్యే సహజ వనరుల ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును స్వాతంత్య్ర దినాన ప్రారంభించబోతున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







