అమరావతి లోఈ నెల 16న లండన్ కింగ్స్ ఆస్పత్రికి శంకుస్థాపన
- August 14, 2017
అమరావతి మనందరికీ గర్వకారణం
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో సీఎం
ప్రపంచంలో మన కీర్తిపతాకను రెపరెపలాడించే అమరావతి మనందరికీ గర్వకారణం సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయనున్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. ఇప్పటికే విట్, ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలు రాజధానిలో తమ క్యాంప్సలను ప్రారంభించాయని, బీఆర్ శెట్టి వైద్యవిజ్ఞాన సంస్థ కొద్ది రోజుల క్రితమే ఇక్కడి తన ప్రాంగణానికి భూమిపూజ జరిపిందని పేర్కొన్నారు.
ఇదే బాటలో మరెన్నో విఖ్యాత విద్యాసంస్థలు అమరావతికి వస్తున్నాయన్న చంద్రబాబు... ప్రపంచంలో పేరొందిన లండన్ కింగ్స్ హాస్పిటల్ రూ.1000 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ నెల 16న శంకుస్థాపన జరుగుతుందన్నారు. రాజధానితోపాటు ప్రతి జిల్లాను ప్రగతికి చిహ్నంగా నిలిచేలా, వాటి భౌగోళిక స్థితిగతులు, లభ్యమయ్యే సహజ వనరుల ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును స్వాతంత్య్ర దినాన ప్రారంభించబోతున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









