ఇక రైలుప్రయాణం ఆనంద దాయకం
- August 14, 2017
భారత రైల్వేలను ఆధునీకరణ దిశగాపరుగులు పెట్టిస్తున్న కేంద్రం మరో సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే దేశంలోని అనేక రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాదాపు 3వేల రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా వినోదాన్ని అందివ్వబోతోంది. ఇందుకోసం వయాకామ్18, జీ, హంగామా, షెమారూ వంటి వీడియో ప్రొవైడర్స్ తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు, వీడియోలను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుంది.
ఆయా రైళ్లలో ఉచితంగా లభించే వైఫై సేవల ద్వారా ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్లలో లాగిన్ అయ్యి ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థలు బిడ్స్ వేసేందుకు ఆసక్తి చూపించాయని వచ్చే నెలలో తమ బిడ్లు దాఖలు చేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాదాపు 24 కంపెనీలు ఇందుకోసం ముందుకొచ్చాయని అర్హత సాధించిన కంపెనీ వద్ద నుంచి వార్షిక లైసెన్స్ ఫీజు వసూలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. దీని ద్వారా రైల్వేకు దాదాపు రూ.500కోట్లు ఆదాయం లభించవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రతి కోచ్లోనూ ఓ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ను ఇన్స్టాల్ చేస్తారు. అందులోని సమాచారాన్ని ప్రతిరోజు అప్డేట్ చేస్తారని దాని ద్వారా ప్రయాణికులు వివిధ వీడియోలు, సినిమాలను వీక్షించవచ్చని సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







