ఎయిరిండియా బంపర్ ఆఫర్
- August 14, 2017
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపికచేసిన దేశీయ విమానాల్లో టిక్కెట్ ప్రారంభ ధర 425 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఎయిరిండియా ప్రకటించింది. విదేశీ విమానాలకైతే రూ.7000 కంటే తక్కువగానే ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. పరిమితి కాల వ్యవధిలో వీటిని ఆఫర్ చేయనున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. 2017 ఆగస్టు 20 వరకు ఈ ''ఫ్రీడం సేల్'' అందుబాటులో ఉంటుందని ఎయిరిండియా తన వెబ్సైట్లో తెలిపింది.
రెండు ప్రయాణ కాలాలు 2017 సెప్టెంబర్ 16 నుంచి 2017 నవంబర్ 30కి మధ్య, 2018 జనవరి 25 నుంచి 2018 మార్చి 31 మధ్య ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా బుకింగ్స్ ఆఫీసులు, ఎయిరిండియా వైబ్సైట్, మొబైల్ యాప్, లేదా ఎయిరిండియా కాల్ సెంటర్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఈ ఆఫర్ను పొందవచ్చు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







