ఎయిరిండియా బంపర్ ఆఫర్
- August 14, 2017
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపికచేసిన దేశీయ విమానాల్లో టిక్కెట్ ప్రారంభ ధర 425 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఎయిరిండియా ప్రకటించింది. విదేశీ విమానాలకైతే రూ.7000 కంటే తక్కువగానే ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. పరిమితి కాల వ్యవధిలో వీటిని ఆఫర్ చేయనున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. 2017 ఆగస్టు 20 వరకు ఈ ''ఫ్రీడం సేల్'' అందుబాటులో ఉంటుందని ఎయిరిండియా తన వెబ్సైట్లో తెలిపింది.
రెండు ప్రయాణ కాలాలు 2017 సెప్టెంబర్ 16 నుంచి 2017 నవంబర్ 30కి మధ్య, 2018 జనవరి 25 నుంచి 2018 మార్చి 31 మధ్య ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా బుకింగ్స్ ఆఫీసులు, ఎయిరిండియా వైబ్సైట్, మొబైల్ యాప్, లేదా ఎయిరిండియా కాల్ సెంటర్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఈ ఆఫర్ను పొందవచ్చు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









