తెలంగాణ నుంచి మక్కాకు తొలి బృందం
- August 14, 2017
452 మంది యాత్రికులతో బయలుదేరిన విమానం
ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాను దర్శించుకోవడానికి సోమవారం తెల్లవారుజామున తొలి విమానంలో దాదాపు 452 మంది హజ్ యాత్రికులు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది తొలిసారిగా హజ్యాత్రికులతో వెళుతున్న సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానంను శంషాబాద్ విమానాశ్రయం హజ్ టర్మినల్ వద్ద ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జెండా వూపి యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ..పేద ముస్లిం కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







