నంద్యాల ఎన్నికల ప్రచారంలోకి హీరో నందమూరి బాలయ్య
- August 15, 2017
నంద్యాల ఉప ఎన్నికల వేడి మాములుగా లేదు..వైసీపీ , టీడీపీ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ క్యాబినెట్ మొత్తం నంద్యాలలోని మకాం వేయగా , రేపు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడు. టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించేందుకు బాలకృష్ణ ప్రచార పర్యటన ఖరారైంది.
బాలకృష్ణ 16న నంద్యాలలో పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ముందుగా పార్టీ శ్రేణులు ఆయనను రెండు రోజులు నంద్యాలలో పర్యటించాలని కోరారు. కానీ ఈ నెల 17 న అయన నటించిన పైసా వసూల్ మూవీ ఆడియో వేడుక ఉండడం తో ఒక్క రోజు మాత్రమే నంద్యాల పర్యటన కు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని ప్రకారమే రేపు అయన పర్యటించనున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని నందమూరి అభిమాన సంఘాల సమావేశమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు నందమూరి అభిమాన సంఘాలు ఇప్పటికే కార్యాచరణ రూపొందించాయి. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్రామ్, నందమూరి తారకరత్న అభిమాన సంఘాల సభ్యులంతా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం









