నంద్యాల ఎన్నికల ప్రచారంలోకి హీరో నందమూరి బాలయ్య
- August 15, 2017
నంద్యాల ఉప ఎన్నికల వేడి మాములుగా లేదు..వైసీపీ , టీడీపీ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ క్యాబినెట్ మొత్తం నంద్యాలలోని మకాం వేయగా , రేపు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడు. టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించేందుకు బాలకృష్ణ ప్రచార పర్యటన ఖరారైంది.
బాలకృష్ణ 16న నంద్యాలలో పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ముందుగా పార్టీ శ్రేణులు ఆయనను రెండు రోజులు నంద్యాలలో పర్యటించాలని కోరారు. కానీ ఈ నెల 17 న అయన నటించిన పైసా వసూల్ మూవీ ఆడియో వేడుక ఉండడం తో ఒక్క రోజు మాత్రమే నంద్యాల పర్యటన కు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని ప్రకారమే రేపు అయన పర్యటించనున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని నందమూరి అభిమాన సంఘాల సమావేశమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు నందమూరి అభిమాన సంఘాలు ఇప్పటికే కార్యాచరణ రూపొందించాయి. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్రామ్, నందమూరి తారకరత్న అభిమాన సంఘాల సభ్యులంతా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









