నంద్యాల ఎన్నికల ప్రచారంలోకి హీరో నందమూరి బాలయ్య
- August 15, 2017
నంద్యాల ఉప ఎన్నికల వేడి మాములుగా లేదు..వైసీపీ , టీడీపీ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ క్యాబినెట్ మొత్తం నంద్యాలలోని మకాం వేయగా , రేపు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడు. టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించేందుకు బాలకృష్ణ ప్రచార పర్యటన ఖరారైంది.
బాలకృష్ణ 16న నంద్యాలలో పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ముందుగా పార్టీ శ్రేణులు ఆయనను రెండు రోజులు నంద్యాలలో పర్యటించాలని కోరారు. కానీ ఈ నెల 17 న అయన నటించిన పైసా వసూల్ మూవీ ఆడియో వేడుక ఉండడం తో ఒక్క రోజు మాత్రమే నంద్యాల పర్యటన కు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని ప్రకారమే రేపు అయన పర్యటించనున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని నందమూరి అభిమాన సంఘాల సమావేశమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు నందమూరి అభిమాన సంఘాలు ఇప్పటికే కార్యాచరణ రూపొందించాయి. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్రామ్, నందమూరి తారకరత్న అభిమాన సంఘాల సభ్యులంతా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







