చెప్పినట్లే.. ప్రసంగాన్ని ముగించిన ప్రధాని మోదీ
- August 15, 2017
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై దేశ ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ముందు చెప్పినట్లే తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. గత నాలుగేళ్లలో మోదీ ప్రసంగం తక్కువ సమయంలో ముగియడం ఇదే మొదటిసారి.
గత నెలలో 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం సందర్భంగా మోదీ.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఎక్కువ సమయం కొనసాగుతోందని పలువురు తనకు ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేశారని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఈసారి తన ప్రసంగాన్ని గంటలోపే ముగిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే తన ప్రసంగాన్ని 54 నిమిషాల్లో ముగించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ 2014లో 65 నిమిషాలు ప్రసంగిస్తే.. 2015లో 86 నిమిషాలు, గత ఏడాది 94 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సారి మోదీ ప్రసంగంపై ప్రజల నుంచి 8 వేలకుపైగా సూచనలు, సలహాలు అందినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..









