బహ్రెయిన్లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 16, 2017
71వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బహ్రెయిన్లోని భారత కమ్యూనిటీ మెంబర్స్, ఇండియన్ మిషన్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గడచిన 70 ఏళ్ళలో భారతదేశం వివిధ రంగాల్లో సాధించిన విజయాల గురించి ఈ సందర్భంగా రాయబారి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇండియన్ ఎంబసీ ఫస్ట్ సెక్రెటరీ మీరా సిసోడియా, సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్, ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు, వారి కుటుంబాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ బహ్రెయిన్, బహ్రెయిన్ కేరళీయ సమాజం, కేరళ కేథలిక్ అసోసియేషన్ సహా పలు ఆర్గనైజేషన్స్ కూడా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. దేశభక్తి గీతాల ఆలాపన సహా పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని ఈ సందర్భంగా నిర్వహించారు. అలాగే జీసీసీ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈజిప్ట్, యూఏఈ సహా పలు దేశాల్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







