బహ్రైన్ లో వి.ఒ.ఐ. పి. సర్వీసులపై అదనపు రుసుము వసూలుకు వ్యతిరేకంగా హెచ్చరిక

- October 23, 2015 , by Maagulf
బహ్రైన్ లో  వి.ఒ.ఐ. పి. సర్వీసులపై అదనపు రుసుము వసూలుకు వ్యతిరేకంగా హెచ్చరిక

 

బహ్రైన్  లోని టెలికాం కంపెనీలు వినియోగదారుల నుండి వి.ఒ.ఐ. పి. (వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్)  వినియోగానిపై అదనపు రుసుమును వసూలు చేయడంపై టెలికమ్మ్యునికేషన్స్ రెగ్యులేటరీ ఆధారిటీ (తర ) హెచ్చరికలను జారీచేసింది. దేశంలోని మూడు టెలికాం సంస్థలు, స్కైప్ మరియు ఫేస్ టైమ్‌వంటి వాయిస్ ఓవర్ ఇంటెర్నెట్ ప్రోటోకాల్ సర్వీసులపై  ఈ విధంగా అదనంగా వసూలు చేయడంపై నిరసనలు వ్యక్తమవడంతో అత్యవసర ఆంక్షలను విధించింది. ఈ విషయంపై తమ దర్యాప్తు మేరకు, ఆ సంస్థలు ఏ విధమైన లిఖిత పూర్వక అనుమతి లేకుండానే సేవల నియమా నిబంధనలను మార్చివేసి, లైసెన్స్ నియమ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరించారు. సదారు టెలికాం ఆపరేటర్లు తమ తప్పులను సరిదిద్దుకొనట్లైతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తర ) డైరక్టర్ జనరల్ మొహమ్మద్ బుబాషైత్ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com