అమెరికాలో అరుదైన స్థానం సంపాదించిన గుంటూరోడు
- August 19, 2017
అమెరికాలో తెలుగుతేజం మెరిసింది. ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా గుంటూరు వాసికి అరుదైన అవకాశం దక్కింది. వర్సిటీలోని వ్యాస్కులర్ సర్జన్ విభాగంలో అమెరికాయేతర వ్యక్తిగా గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన కార్తీక్ మిక్కినేని ఎంపికయ్యారు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కార్తీక్ న్యూయార్క్లోని విల్ కార్నెల్ మెడికల్ కళాశాలలో ఏడాది పాటు ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం ఫిట్స్బర్గ్ యూనివర్సిటీలో వ్యాస్కులర్ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. ఏడాదికి రూ.2.08 కోట్ల ప్యాకేజీతో మూడేళ్ల పాటు యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందని ఈ సందర్భంగా కార్తీక్ 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. మూడేళ్ల అనంతరం తాను అంగీకరిస్తే ఒప్పందాన్ని పొడిగిస్తారన్నారు. మూడేళ్ల తరువాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆస్పత్రి స్థాపించి సేవలు చేయాలని భావిస్తున్నాని అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







