ప్రభాస్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో
- August 21, 2017
బాహుబలి 2 తర్వాత చాల గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఎట్టకేలకు తన నూతన చిత్రం సాహో షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారధి స్టుడియోస్ లో దాదాపు 5 కోట్ల రూపాయల వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించి ప్రముఖ టెక్నీషియయన్లతో పాటు బాలీవుడ్ కు చెందిన స్టార్ నటీ నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన టీమ్ ఇంతకు ముందే నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే వంటి హిందీ నటుల్ని ప్రతి నాయకులుగా ఎంచుకుంది.
వీరితో పాటు ఇప్పుడు తాజాగా మరొక బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ ను కూడా సినిమాలోకి తీసుకుంది. జాకీ ష్రాఫ్ గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' లో స్టైలిష్ విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. వచ్చే వారం నుండి ఈయన షూటింగ్లో పాల్గొననున్నారు.
ఈ సినిమా కోసం కొన్ని అండర్ వాటర్ షాట్స్ కూడా ప్లాన్ చేశారు. కథ ప్రకారం సముద్ర గర్భంలో ప్రభాస్ సాహసాలు చేసే సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం ఈమధ్యే టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ చేశాడు దర్శకుడు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ దుబాయ్ లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







