సిరియాలోని అమెరికా దాడుల్లో 42మంది మృతి

- August 22, 2017 , by Maagulf
సిరియాలోని అమెరికా దాడుల్లో 42మంది మృతి

సిరియాలోని ఐసిస్‌ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా నేతృత్వంలోని బలగాలు వైమానిక దాడులు జరిపాయి. రక్కా నగరంపై జరిపిన ఈ దాడుల్లో దాదాపు 42 మంది పౌరులు మృతి చెందినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెల్లడించింది. వీరిలో 19 మంది చిన్నారులతో పాటు 12 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల సిరియాలోని డైర్‌ అల్‌జోర్‌ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో 60 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. సిరియాలోని ఉత్తర భాగంలో తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా దళాలు 2014 నుంచి దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. దీనిపై సిరియా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com