సిరియాలోని అమెరికా దాడుల్లో 42మంది మృతి
- August 22, 2017
సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా నేతృత్వంలోని బలగాలు వైమానిక దాడులు జరిపాయి. రక్కా నగరంపై జరిపిన ఈ దాడుల్లో దాదాపు 42 మంది పౌరులు మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. వీరిలో 19 మంది చిన్నారులతో పాటు 12 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల సిరియాలోని డైర్ అల్జోర్ ప్రావిన్స్లో అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో 60 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. సిరియాలోని ఉత్తర భాగంలో తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా దళాలు 2014 నుంచి దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. దీనిపై సిరియా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







