మనీ లాండరింగ్‌: 215 మంది దోషులు

- August 22, 2017 , by Maagulf
మనీ లాండరింగ్‌: 215 మంది దోషులు

జెడ్డా: 2015 - 2016 మధ్యకాలంలో 66 మంది సౌదీలు, 149 మంది నివాసితులు మనీ లాండరింగ్‌ కేసుల్లో దోషులుగా తేలినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రియాద్‌లో 15 మంది సౌదీలు, 28 నివాసితులు, మక్కాలో 18 మంది సౌదీలు, 41 మంది నివాసితులు, మదీనాలో ఇద్దరు సౌదీలు, ఏడుగురు నివాసితులు, అల్‌ కాసిమ్‌లో ఇద్దరు నివాసితులు, అల్‌ షర్కియాలో 25 మంది సౌదీలు, 66 మంది నివాసితులు, అసిర్‌లో ఐదుగురు సౌదీలు, నలుగురు నివాసితులు మనీలాండరింగ్‌ కేసుల్లో దోషులుగా తేలడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మనీ ల్యాండరింగ్‌ అనేది సర్వసాధారణమైన క్రిమినల్‌ ఆపరేషన్‌గా మారిందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి వ్యతిరేకంగా తగు చర్యలు తీసుకుంటున్నాయని న్యాయవాది అహ్మద్‌ అల్‌ షెహ్రి చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌, మనీ ఎక్స్‌ఛేంజ్‌ రంగాల్లో ఉన్న ఉద్యోగుల్ని మరింతగా ఎడ్యుకేట్‌ చేయడం ద్వారా మనీ లాండరింగ్‌ని అరికట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com