చవితికి రెండో పాట రిలీజ్ చేయనున్న యుద్ధం శరణం టీం

- August 23, 2017 , by Maagulf
చవితికి రెండో పాట రిలీజ్ చేయనున్న యుద్ధం శరణం టీం

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆ పాటతో సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ పరిచయం చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేస్తోంది. వినాయకచవితికి ఒక రోజు ముందుగానే సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేయనున్నారు. నాగోల్ లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పాటను లాంచ్ చేయబోతున్నట్టు హీరో నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com