'వీడెవడు' పోటీకి రెడీ గా ఉంది
- August 23, 2017
సెప్టెంబర్ మూడో వారం నుంచి భారీ చిత్రాలు లైన్ లో ఉండటంతో చిన్న సినిమాలన్ని ఈ లోపే థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 8న భారీ పోటి తప్పేలా లేదు. ఆ రోజు రిలీజ్ అవుతున్న సినిమాల్లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న యుద్ధం శరణంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నెలాఖరున రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 8న రిలీజ్ చేస్తున్నారు.
అదే రోజు పోటి పడుతున్న మరో సినిమా మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు. చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్.. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ గెటప్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కామెడీ స్టార్ అల్లరి నరేష్ కూడా అదే రోజు రిస్క్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి సినిమాతో సెప్టెంబర్ 8న బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు.
ఈ మూడు సినిమాలతోనే థియేటర్లు బిజీ అంటే తాజాగా మరో సినిమా లైన్ లోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సచిన్ జోషి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'వీడెవడు' సినిమాను కూడా సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఇంట్రస్టింగ్ సినిమాలతో భారీ పోటి నెలకొన్న నేపథ్యంలో వీడెవడు సినిమా రిలీజ్ చేయటం రిస్క్ అని భావిస్తున్నా.. తమిళ్ లోనూ అదే రోజు రిలీజ్ చేస్తుండటంతో డేట్ మార్చే ఛాన్స్ కనిపించటం లేదు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







