గురువారం ప్రారంభించనున్న మసాక్-షినాస్-ఖాసబ్ సేవలు
- August 23, 2017
ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ 'మ్వాసలాట్' గురువారం నుంచి మస్కట్ -షినాస్-ఖాసబ్ మార్గాన్ని ప్రారంభిస్తుంది. ఇది సుల్తానెట్ లో భూమి మరియు సముద్రాన్ని కలిపే మొట్టమొదటి మార్గం. సుల్తానాట్లో రవాణా, నిర్మాణరంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు. ఆగష్టు 24 వ తేదీ నుండి ఆగస్టు 31 వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఓ ఏకైక అనుభూతి కోసం ఈ కొత్త మస్కట్-ఖాసబ్ మార్గం మరియు ఖాసబ్-మస్కాట్ మార్గంలో ప్రయాణీకులు పరిమిత సీట్లకు ఈ సేవ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సు మరియు ఫెర్రీలను మొదటిసారిగా వినియోగించనున్నారు. ముసణ్డం గవర్నరేట్ పరిధిలో ఉద్యోగులు మరియు నివాసితులు కోసం ప్రత్యేక ధరలు మరియు 3-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 50 శాతం రాయితీని కల్పించనున్నారు. అలాగే మూడేళ్ళ వయస్సు గల పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అల్ అజాబా, అల్ సహబ్ టవర్, అల్ మబాలియా మరియు సోహార్లలోని మెజాసలత్ కార్యాలయాల్లో ఆయా శాఖలలో టికెట్లు లభ్యం కానున్నాయి. మరియు కాల్ సెంటర్ లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. సీట్లు పరిమితమైనందున ముందస్తు టికెట్ల బుకింగ్ 24 గంటల ముందు ప్రయాణానికి చేసుకోవాలని ఈ సందర్బముగా సిఫార్సు చేయబడింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







