సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా సెప్టెంబర్ రెండో వారంలో ప్రాజెక్ట్ Z విడుదల
- August 25, 2017
ఎస్.కె. అబ్దుల్లా సమర్పణలో ఎస్.బి.కె ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ Z. ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.వి.కుమార్. నిర్మాతలు ఎస్.కె. బషీద్, ఎస్.కె. కరిమున్నీసా. ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె. బషీద్ చిత్ర విశేషాలను మీడియాకి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. మా ఈ ప్రాజెక్ట్ జెడ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ని సెన్సార్ సభ్యులు ఇచ్చారు. చిత్రం చాలా బాగా వచ్చింది. సందీప్కిషన్ ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్లో నటించాడు. అతడి కెరీర్లో ఈ చిత్రం పెద్ద హిట్ చిత్రంగా నిలబడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చిత్రం కాన్సెఫ్ట్ అంత కొత్తగా ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి మ్యూజిక్ని ఇచ్చాడు. ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యే మూవీ మాత్రం కాదని పక్కాగా చెబుతున్నా. రాబోయే పది సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేదే ఈ చిత్ర కథ. సెన్సార్ వాళ్ళు కూడా ఈ చిత్రం చాలా బాగుందని టీమ్ని మెచ్చుకున్నారు. త్వరలో ఆడియో ఫంక్షన్ని నిర్వహించి, సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు మా బ్యానర్లో రెడీ అవుతున్నాయి. మా ఈ ప్రాజెక్ట్ Z విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









