మళ్లీ పెరుగుతున్న బంగారం

- August 25, 2017 , by Maagulf
మళ్లీ పెరుగుతున్న బంగారం

అంతకంతకూ కిందకి పడిపోయిన బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పైకి వచ్చేసింది. నిన్న నాలుగొందలు తగ్గినా ధర ఇవాళ ట్రేడింగ్ లో రెండొందల ముప్పై రూపాయలు పెరిగింది.బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు రావడంతో పసిడిధర పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో వెండి ధర కూడా రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 0.25 శాతం పెరిగి ఔన్సు 1,191.30 డాలర్లుగా నమోదు కాగా, వెండి కూడా 2.27 శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లకు చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com