జమ్ముకశ్మీర్లో 35ఏ అధికరణపై దీపావళి తర్వాత విచారణ
- August 25, 2017
జమ్ముకశ్మీర్లో శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు, సదుపాయాలు కల్పించే రాజ్యాంగంలోని 35ఏ అధికరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై దీపావళి తర్వాత విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీపావళి తర్వాత వాదనలు జరిపేందుకు కేంద్రం ప్రభుత్వానికి సైతం ఎలాంటి అభ్యంతరం లేదని, విచారణ వాయిదా వేయాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం మన్నించింది.
1954లో రాష్ట్రపతి అదేశం ద్వారా రాజ్యాంగానికి జోడించిన 35ఏ అధికరణ జమ్ముకశ్మీర్ శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది.కశ్మీర్ మహిళ వేరే రాష్ట్ర వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమె ఆస్తి హక్కును కొల్పోతుందని ఆ అధికరణ చెబుతుంది. ప్రజల సమానత్వపు హక్కు లేదా రాజ్యాంగంలోని ఏదైనా హక్కును ఉల్లంఘిస్తుందని సవాలు చేసే వీలు లేకుండా ఎలాంటి చట్టాన్నైనా చేసేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. 35ఏ అధికరణ సహా జమ్ముకశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 6లోని ఇలాంటి నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అవసరమైతే ఈ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







