మరోసారి తన నిజ స్వరూపం బయట పెట్టిన చైనా

- August 26, 2017 , by Maagulf
మరోసారి తన నిజ స్వరూపం బయట పెట్టిన చైనా

చైనా నుంచి వచ్చిన బూట్ల డబ్బాలపై త్రివర్ణ పతాకం ముద్రించి చైనా భారత జాతీయ పతాకానికి అవమానం చేసింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా కావాలనే భారతీయుల మనోభావాలను దెబ్బతీయడానికి ఈ పని చేసిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఉత్తరాఖండ్ లోని అల్మోరాలోని ఒక దుకాణదారుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ బూట్ల డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com