ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లక్షమందితో ఘన స్వాగతం
- August 26, 2017
ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంకయ్యనాయుడు తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరారు. వెంకయ్యకు చంద్రబాబు ఘనంగా ఆహ్వానం పలికారు. ఉపరాష్ట్రపతిని అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విద్యార్ధులు, మహిళలు, మానవహారంగా ఏర్పడ్డారు. ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు.. ZP చైర్మన్లు, ఇతర నాయకులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు.
అమరావతిలో పౌర సన్మానం జరిగిన తర్వాత వెంకయ్య తెనాలిలో పర్యటిస్తారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటాయించిన పట్టణ పేదల నివాస గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







