ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లక్షమందితో ఘన స్వాగతం
- August 26, 2017
ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంకయ్యనాయుడు తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరారు. వెంకయ్యకు చంద్రబాబు ఘనంగా ఆహ్వానం పలికారు. ఉపరాష్ట్రపతిని అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విద్యార్ధులు, మహిళలు, మానవహారంగా ఏర్పడ్డారు. ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు.. ZP చైర్మన్లు, ఇతర నాయకులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు.
అమరావతిలో పౌర సన్మానం జరిగిన తర్వాత వెంకయ్య తెనాలిలో పర్యటిస్తారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటాయించిన పట్టణ పేదల నివాస గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









