ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లక్షమందితో ఘన స్వాగతం

- August 26, 2017 , by Maagulf
ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లక్షమందితో ఘన స్వాగతం

ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంకయ్యనాయుడు తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. వెంకయ్యకు చంద్రబాబు ఘనంగా ఆహ్వానం పలికారు. ఉపరాష్ట్రపతిని అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విద్యార్ధులు, మహిళలు, మానవహారంగా ఏర్పడ్డారు. ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు.. ZP చైర్మన్లు, ఇతర నాయకులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు.
అమరావతిలో పౌర సన్మానం జరిగిన తర్వాత వెంకయ్య తెనాలిలో పర్యటిస్తారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటాయించిన పట్టణ పేదల నివాస గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com