ట్రంప్ వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా రాజీనామా
- August 27, 2017
ట్రంప్ బృందాల రాజీనామాల లిస్ట్లో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా చేరింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో సైబర్ సెక్యూరిటీకి ట్రంప్ ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ ఏడుగురు సభ్యుల బృందం రాజీనామా చేసింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన డాటా ఇంజనీరు కూడా ఉన్నారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ కౌన్సిల్గా పిలిచే ఈ బృందం జాతీయ సైబర్ భద్రత గురించి నిర్వహణ లోపాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు అమెరికా ప్రజలు ఆధారపడే వ్యవస్థల సైబర్ భద్రతకు ముప్పు పెరిగిపోతోందని, అటువంటి ప్రభావమే అధ్యక్ష ఎన్నికల్లో అగుపించిందని పేర్కొంది. దేశంలో జాతి విద్వేష హింసను అదుపు చేయడంలో ట్రంప్ విఫలం కావడం కూడా ఈ బృందం వైదొలగటానికి హేతువుగా పేర్కొంది. దీంతో పాటు శ్రామికుల తరపున అమెరికన్ సివిల్ వార్లో పోరాడిన జనరల్ రాబర్ట్ ఈ లీ విగ్రహ తొలగింపు ప్రతిపాదనను ఈ బృందం నిరసించింది. వీరి రాజీనామాకు ముందు ట్రంప్ బృందంలో మరో రెండు విభాగాలు రాజీనామా చేశాయి. అడ్మినిస్ట్రేషన్ డిసాల్వ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కౌన్సిల్, స్టాటజీ అండ్ పాలసీ ఫోరమ్లకు కూడా రాజీనామా చేశాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









