ట్రంప్ వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా రాజీనామా
- August 27, 2017
ట్రంప్ బృందాల రాజీనామాల లిస్ట్లో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా చేరింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో సైబర్ సెక్యూరిటీకి ట్రంప్ ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ ఏడుగురు సభ్యుల బృందం రాజీనామా చేసింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన డాటా ఇంజనీరు కూడా ఉన్నారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ కౌన్సిల్గా పిలిచే ఈ బృందం జాతీయ సైబర్ భద్రత గురించి నిర్వహణ లోపాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు అమెరికా ప్రజలు ఆధారపడే వ్యవస్థల సైబర్ భద్రతకు ముప్పు పెరిగిపోతోందని, అటువంటి ప్రభావమే అధ్యక్ష ఎన్నికల్లో అగుపించిందని పేర్కొంది. దేశంలో జాతి విద్వేష హింసను అదుపు చేయడంలో ట్రంప్ విఫలం కావడం కూడా ఈ బృందం వైదొలగటానికి హేతువుగా పేర్కొంది. దీంతో పాటు శ్రామికుల తరపున అమెరికన్ సివిల్ వార్లో పోరాడిన జనరల్ రాబర్ట్ ఈ లీ విగ్రహ తొలగింపు ప్రతిపాదనను ఈ బృందం నిరసించింది. వీరి రాజీనామాకు ముందు ట్రంప్ బృందంలో మరో రెండు విభాగాలు రాజీనామా చేశాయి. అడ్మినిస్ట్రేషన్ డిసాల్వ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కౌన్సిల్, స్టాటజీ అండ్ పాలసీ ఫోరమ్లకు కూడా రాజీనామా చేశాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







