హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం
- August 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం హజ్ యాత్రీకుల కోసం 16,000 యూనిట్ల రక్తం, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్ని సిద్ధం చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో పవిత్ర నగరాల్లో యాత్రీకులకు వైద్య చికిత్స అందించేందుకోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట రక్తదాన శిబిరాల్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రక్తాన్ని, అలాగే బ్లడ్ ప్రోడక్ట్స్ని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెప్పారు. మక్కాలో 9 ఆసుపత్రులు, అరాఫత్లో 4, మినాలో 4 ఆసుపత్రులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్తో యాత్రీకులకు వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పదిహేడు రీజియన్లు, గవర్నరేట్లు, పబ్లిక్, ఐవేట్ మరియు మిలిటరీ సెక్టార్ నుంచి 27 భాగస్వాములు కలిపి మొత్తంగా 16,000 యూనిట్ల రక్తాన్ని సమీకరించడం జరిగింది. రెండు కార్లు, ఐదు టీమ్లు బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ కోసం వినియోగిస్తున్నారు. ఇవి అంబులెన్సులకు అదనం.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









