బహ్రెయిన్ లో ప్రవాసీయ కార్మికుడు మృతి
- August 28, 2017
మనామా : రెండు రోజుల వ్యవధిలో మరో ఆసియా ప్రవాసీయుడు శనివారం రఫ్ఫాలోని తన నివాసంలో చనిపోయాడు.హారవిందర్ సింగ్ గా గుర్తించబడిన ఈ వ్యక్తి ఆటోమొబైల్ మెకానిక్ గా అల్ మోయిడ్ మోటార్స్ కో లో పనిచేస్తున్నాడు. బహ్రెయిన్ రాజ్యంలో తన సోదరుడితో పాటు కల్సి రఫ్ఫాలో నివసిస్తూ ఉండేవారు. తెల్లవారుజామున హారవిందర్ సింగ్ స్నాలగదిలో చనిపోయి ఉండటాన్ని కనుగొన్నారు. ఆ పరిస్థితిలో ఆయనను చూసిన మేము ఆసుపత్రి సిబ్బందిని వెంటనే పిలిచాము. పారామెడికల్ బృందం అక్కడకు చేరుకొని అప్పటికే ఆయన మరణించినట్లు ధ్రువీకరించారని స్థానిక నివాసి ఒకరు చెప్పారు. హారవిందర్ సింగ్ మరణానికి కారణం తెలియదు. చట్టపరమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు చెప్పారు. రెండు రోజుల క్రితం మాలిక్యా లో నిర్మాణ సంస్థ లో వడ్రంగిగా పనిచేస్తున్న ఒక ఆసియా కార్మికుడు బుద రామ్ విషాదంగా మరణించిన విషయం మరవక ముందే మరొక ప్రవాస భారతీయుడు చనిపోవడంతో ప్రవాసీయులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







