బహ్రెయిన్ లో ప్రవాసీయ కార్మికుడు మృతి
- August 28, 2017
మనామా : రెండు రోజుల వ్యవధిలో మరో ఆసియా ప్రవాసీయుడు శనివారం రఫ్ఫాలోని తన నివాసంలో చనిపోయాడు.హారవిందర్ సింగ్ గా గుర్తించబడిన ఈ వ్యక్తి ఆటోమొబైల్ మెకానిక్ గా అల్ మోయిడ్ మోటార్స్ కో లో పనిచేస్తున్నాడు. బహ్రెయిన్ రాజ్యంలో తన సోదరుడితో పాటు కల్సి రఫ్ఫాలో నివసిస్తూ ఉండేవారు. తెల్లవారుజామున హారవిందర్ సింగ్ స్నాలగదిలో చనిపోయి ఉండటాన్ని కనుగొన్నారు. ఆ పరిస్థితిలో ఆయనను చూసిన మేము ఆసుపత్రి సిబ్బందిని వెంటనే పిలిచాము. పారామెడికల్ బృందం అక్కడకు చేరుకొని అప్పటికే ఆయన మరణించినట్లు ధ్రువీకరించారని స్థానిక నివాసి ఒకరు చెప్పారు. హారవిందర్ సింగ్ మరణానికి కారణం తెలియదు. చట్టపరమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అధికారులు చెప్పారు. రెండు రోజుల క్రితం మాలిక్యా లో నిర్మాణ సంస్థ లో వడ్రంగిగా పనిచేస్తున్న ఒక ఆసియా కార్మికుడు బుద రామ్ విషాదంగా మరణించిన విషయం మరవక ముందే మరొక ప్రవాస భారతీయుడు చనిపోవడంతో ప్రవాసీయులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









