హజ్ అనుమతిలను ధృవీకరించడానికి బయోమెట్రిక్స్ వ్యవస్థ ప్రారంభం
- August 28, 2017
జెడ్డా : నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసి) మరియు పబ్లిక్ సెక్యూరిటీ సంయుక్తంగా స్మార్ట్ పరికరాలతో ఉపయోగించేందుకు మొబైల్ బయోమెట్రిక్స్ వ్యవస్థను ప్రారంభించారు. హజ్ అనుమతిలను ధృవీకరించడానికి వేలిముద్రల ద్వారా జాతీయ గుర్తింపు సంఖ్య లేదా నివాస గుర్తింపు సంఖ్య ద్వారా రికార్డు సమయంలో, కొన్ని సెకన్లలో మించకుండా హజ్ అనుమతిలను మరియు భద్రతా స్కానింగ్ ని తనిఖీ చేయవచ్చు. ఈ వ్యవస్థలో భద్రతా సిబ్బందికి అనేక ఎలక్ట్రానిక్ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న హజ్ సీజన్లో సులువుగా ఉపయోగించే స్మార్ట్ పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ రంగంలో భద్రతా సిబ్బంది సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి అవకాశం ఏర్పడుతుంధి, ఈ పరికరాలు వేలిముద్రలు మరియు గుర్తింపుని చదివే విధానం మరియు కెమెరాలు ఫోటోలను తీయడానికి ఇందులో కలిగి ఉంటాయి. నమోదు చేయని బయోమెట్రిక్స్ తీసుకోవడం కాకుండా వాటిని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసి) వద్ద వేలిముద్రని గుర్తించే విధానం పంపడం జరుగుతుంది. అలాగే జాతీయ గుర్తింపు లేదా నివాస గుర్తింపు సంఖ్యలు ద్వారా వ్యక్తుల గుర్తింపు. సిస్టమ్ హజార్ అనుమతి, ఉల్లంఘనల మరియు వారి రిజిస్ట్రేషన్ లో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో సమాచారం సమగ్రంగా తెలుసుకోవచ్చు. వ్యక్తిగత వేలిముద్రల ద్వారా వారి రిజిస్ట్రేషన్ ద్వారా వ్యవస్థ యొక్క ఆపరేటర్ నిర్వహించిన రిజిస్ట్రేషన్ నివేదికలను అందిస్తుంది. వ్యవస్థను ప్రారంభించడం సాంకేతిక మరియు భద్రతా రంగంలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రజా రక్షణ సమర్ధవంతంగా నిర్వహించబడింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









