మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాలలు

- October 26, 2015 , by Maagulf
మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాలలు

 మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాల లు కతార్ లోని నాలుగు వారసత్వ భవనాలైన మొహమ్మెద్ బిన్ జస్సిమ్ హౌస్, రద్వానీ హౌస్, కంపెనీ హౌస్ మరియు బిన్ జెల్మూద్ హౌస్ అనేవి మానవజాతి యొక్క  పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కడతాయి. ఇంకా దోహాలో చమురు నిల్వలను కనుగొనక ముందు మరియు అనంతరం కుటుంబ జీవనంలో వచ్చిన మార్పులను చక్కగా వివరిస్తాయి.20.4 బిలియన్ కతార్ రియాల్ ల వ్యయంతో నిర్మితమైన, డౌన్‌టౌన్ దోహా (ఎం. డి. డి. ) ప్రాజెక్టు లో భాగమైన ఈ భవనాలలో, కతార్ యొక్క ఘన చరితను, గతాన్ని తెలియజెయడానికి ఆ రంగంలోనే మొదతిదైన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. బ్రిటిష్ వారి ఆగమనంతో ఆహారపుటలవాట్లు, క్రీడలు మరియు మరిన్ని ఇతర అంశాలలో చోటుచేసుకున్న అనేక మార్పులను గురించి నేటి తరానికి తెలియజేప్పాలనేది తమ లక్ష్యమని, అందుకే తాము అందరినీ ఈ ప్రదేశాలను దర్శించవలసిందిగా  హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, మ్యూజియం మేనేజర్ - హాఫిజ్ అలీ అలీ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com