నిర్మాతగా మారబోతున్న హీరో నాని
- August 29, 2017
వరుస విజయాలతో దూసుకెళ్ళేతున్న నాని , తాజాగా నిర్మాత గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో నాని ఓ సినిమా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవల ప్రశాంత్ వర్మ చెప్పిన ఆసకికరమైన కథ నచ్చడంతో నాని ఈ ప్రాజెక్టును నిర్మించాలని అనుకుంటుకున్నారట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద నటుల్ని కలవడం జరిగిందని, వాళ్ళు కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నాని వైపు నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటకురాలేదు. నానికి మొదటి నుండి నిర్మాతగా రాణించాలనే కోరిక బలంగా ఉంది. అందుకే ఓ మంచి కథ తో నిర్మాత గా రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఎంసిఏ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే నేను లోకల్ , నిన్ను కోరి చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







